ప్రమాదంలో మృతి చెందిన గీత కార్మికుడి కుటుంబానికి : జలవనరుల శాఖ మంత్రి పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆయన ప్రజలకు కష్టం వస్తే అండగా నిలబడే నాయకుడు. ప్రజల బాగోగులు చూసుకునే నాయకుడు. నిత్యం ప్రజల్లోనే తిరిగే నాయకుడు. తాజాగా ఆయన కల్లు గీత కార్మికుడు ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి పడి మృతి చెందితే అతని కుటుంబానికి ఆయన ఆర్థిక సాయం అందించారు. పూర్తి కథనం వివరాళ్ళకి వెళ్లి తెలుసుకుందాం.
ప్రమాదంలో మృతి చెందిన గీత కార్మికుడి కుటుంబానికి
పాలకొల్లు మండలం పాలమూరు గ్రామానికి చెందిన గీత కార్మికుడు పాలా నాగ మున్నేశ్వరరావు ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి పడి మృతి చెందగా అతని కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయంగా మంజూరైన 2 లక్షలు, తన వంతుగా మరో 50 వేలు ఆర్థిక సహాయాన్ని కలిపి మొత్తం 2 లక్షల 50 వేలను అతని కుటుంబ సభ్యులకు రామానాయుడు గారు అందజేశారు. కష్టకాలంలో కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందనడానికి ఇదొక నిదర్శనం.
