చంద్రబాబుకి సిబిఐ రిపోర్ట్ కాదు సీబీఎన్ రిపోర్ట్ : ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి పైన మాజీ మంత్రి వైసిపి నాయకురాలు విడదల రజిని పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి కావాల్సింది సిబిఐ రిపోర్ట్ కాదు సీబీఎన్ రిపోర్ట్ అని విడదల రజిని గారు పేర్కొన్నారు. పూర్తి కథనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.
చంద్రబాబుకి సిబిఐ రిపోర్ట్ కాదు సీబీఎన్ రిపోర్ట్
విడదల రజిని మాట్లాడుతూ… ఇవన్నీ చూస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారికి కావాల్సింది సిబిఐ రిపోర్ట్ కాదు సీబీఎన్ రిపోర్ట్. సీబీఎన్ రిపోర్ట్ కావాలి కాబట్టే ఇంకా వేరే కమిటీలు అంటున్నాడు. సుప్రీమ్ కోర్ట్ వేసి ఇచ్చిన కమిటీ కూడా సాటిస్పై కాకుండా ఇంకేదేదో మాట్లాడుతున్నాడు. దీన్ని బట్టి అర్థం అవుతుంది. వీళ్ళు మెడికల్ కాలేజ్ విషయంలో ప్రైవేటీకరణ అని జనంలో వీపీలు అయ్యారు.
తిరుపతి లడ్డు విషయంలో కూడా డిఫెమ్ అయ్యారు. ఇవి కప్పి పుచ్చుకోవడానికి ఇంకా ప్రజల్ని నమ్మించే ప్రయత్నం. వైసిపి పార్టీకి ఆపాదించేటువంటి ప్రయత్నం. ప్రజలు వైసిపి పార్టీని ఇంకోలా అనుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కుళ్లు కుతంత్రాలుగా చూడాల్సిన అవసరం ఉంది.
చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కుట్రలు చేసిన ఎన్ని అవాస్తవాలు చెప్పిన ఎన్ని అసత్యాలు చెప్పిన ఆ దేవుడు ఉన్నాడు మాకు నమ్మకం ఉంది. స్పష్టంగా సిబిఐ సిట్ లో పేర్కొంది. నిజం ఏంటో ప్రజలందరూ కూడా చూస్తున్నారు. అని విడదల రజిని గారు పేర్కొన్నారు.
