అంబటి ఇంట్లో నగలు వెండి చోరి : మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంబటి రాంబాబు ఫ్యామిలీని పరామర్శించడానికి వెళ్లడం జరిగింది. ఆ పరామర్శ టైం లో అంబటి ఇంట్లో బంగారం వెండి చోరి అయ్యిందట. ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పూర్తి కథనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.
అంబటి ఇంట్లో నగలు వెండి చోరి
అంబటి రాంబాబు ఇంట్లో రెండు కిలోల వెండి 70 తులాల బంగారం మాయమయ్యింది. పోలీసులకు పిర్యాదు చేద్దామంటే ఒక ఇబ్బంది చేయకపోతే మరొక ఇబ్బందిలా తయారయ్యింది. ఇప్పుడు అంబటి కుటుంబ సభ్యుల పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసి జైలు పాలైన అంబటి కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్ జగన్ గుంటూరు వెళ్లారు.
ఈ పరామర్శ సమయంలోనే అంబటి ఇంట్లో విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. ఇంట్లోనే బీరువాలో భద్రపరిచిన రెండు కిలోల వెండితో పాటు 70 తులాల బంగారం మాయమవ్వడం రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. టిడిపి కార్యకర్తలు అంబటి ఇంటిపైకి వెళ్ళినప్పుడు ఒక్కటి కూడా చోరీ కాలేదు. కానీ జగన్ వెంట వచ్చిన సైన్యం పరామర్శ ముగించుకొని వెళ్లిన క్షణాల్లోనే ఇంత భారీ మొత్తంలో నగలు వెండి అదృశ్యం కావడం విశేషం.
ఈ వార్త యూట్యూబ్ లో ఒక ఛానెల్ లో ప్రచారమైన వీడియో ఆధారంగా వ్రాయబడింది. ఎంత నిజం ఉందొ తెలీదు మరి. అసలు నిజాలు తెలియాలంటే వేచి చూడాలి.
