- రేవంత్ రెడ్డి వీపు చింతపండు చేస్తారు
- భూపాలపల్లి జిల్లా చేసింది కెసిఆర్
- భూపాలపల్లికి మెడికల్ కాలేజ్ తెచ్చింది కెసిఆర్
- భూపాలపల్లిలో 1000 డబల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టింది కెసిఆర్
రేవంత్ రెడ్డి వీపు చింతపండు చేస్తారు : తెలంగాణ సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి ని ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. అదేంటంటే భూపాలపల్లి జిల్లాను తీసేస్తే, భూపాలపల్లి ప్రజలు రేవంత్ రెడ్డి వీపు చింతపండు చేస్తారని కేటీఆర్ గారు వ్యాఖ్యానించారు. పూర్తి కథనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.
రేవంత్ రెడ్డి వీపు చింతపండు చేస్తారు
కేటీఆర్ మాట్లాడుతూ… నిన్న వచ్చి అంటాడు భూపాలపల్లి జిల్లాను రేవంత్ రెడ్డి తీసేయడంట, అది నువ్వు పెట్టినావు రా తీసేయడానికి జయశంకర్ సర్ పేరు పైన పెట్టింది కెసిఆర్. భూపాలపల్లి జిల్లా చేసింది కెసిఆర్. భూపాలపల్లికి మెడికల్ కాలేజ్ తెచ్చింది కెసిఆర్. భూపాలపల్లిలో 1000 డబల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టింది కెసిఆర్. సింగరేణి క్వార్టర్లు కట్టింది కెసిఆర్. సింగరేణికి న్యాయం చేసింది కెసిఆర్. మళ్ళీ ఈ పీకిందేంటి ఈ రెండేళ్లలో, తీసేస్తే ఊరికే ఉండటానికి భూపాలపల్లి వాళ్ళు అమాయకులు అనుకుంటున్నావా వీపు చింతపండు అయితాది అని రేవంత్ రెడ్డికి తెలుసు.
